మక్కా (కాబా) లో ఉన్నది ఏమిటి - ముస్లిమ్స్ పూజిస్తున్నది ఎవ్వరిని - కాబా లో ఉన్నది శివ లింగమా కాదా ?
వాస్తవానికి ముస్లిములు అల్లాహ్ అని పిలుస్తున్నది అమ్మవారినే. అమ్మవారంటే
ఉజ్జయినీ మహాకాళి. చంద్రగుప్త విక్రమాదిత్యుని పాలనలో అరేబియా ఉన్నప్పుడు -
అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం -
అప్పటికింకా మహ్మదీయ మతం లేదు. ఒకసారి సామ్రాజ్య పర్యటనలో భాగంగా ఆయన
అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అక్కడి ప్రజలు తమక్కూడా ఉజ్జయినీ మహాకాళి ఆలయం
లాంటిది కావాలని చక్రవర్తిని అభ్యర్థించారు. అప్పటికి అరబ్బీ మాట్లాడే
అరేబియన్ లంతా హిందువులే. అరబ్బీ బ్రాహ్మలు కూడా ఉండేవారు. చక్రవర్తి
సరేనని చెప్పి ఇప్పుడు మక్కా అని పిలుస్తున్న ప్రదేశంలో మహాకాళీ ఆలయాన్ని
నిర్మించాడు.అది నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. గమనించాల్సిన
విషయమేంటంటే ఇది ఊహ కాదు. దీనికి పురావస్తు సాక్ష్యం (Archaeological
evidence) ఉంది. అరబ్బీ భాషలో ఈ విషయం తెలియజేస్తూ అక్కడ చంద్రగుప్త
విక్రమాదిత్యుడు వేయించిన శిలాశాసనమే ఇందుకు నిదర్శనం. ఆ దేవాలయం
అతిత్వరలోనే యావత్తు అరబ్బీ దేశపు హిందువులకీ కేంద్రస్థానంగా, శైవ
పీఠాధిపత్యంగా మారింది. ఇప్పుడు మక్కా వెళ్ళే హజ్ యాత్రికులంతా దర్శించేది ఆ
మహాకాళీ ఆలయాన్నే. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసమే ఆఱో శతాబ్దంలో ప్రవక్త
మహ్మదుగారు తతిమ్మా అరబ్బీ తెగలతో (శైవులతో) హోరాహోరీ పోరాడాడు. ఆయన
విగ్రహారాధకులతో పోరాడాడని కొరాన్ లో వ్రాశారు.ఆ ఆలయంలో కాబా అని పిలిచే
నల్లఱాయి (అదే అల్లాహ్ అంటారు వాళ్ళు) ఒక గోడలో తాపడం చేసి ఉంటుంది.
శివలింగం లేని పానవట్టాన్ని ఒకసారి ఊహించుకోండి. అది సరిగ్గా అలా ఉంటుంది.
లింగం స్థానంలో లోతుకు పోయిన ఖాళీసొట్ట కూడా ఉంటుంది. పానవట్టం
పార్వతీస్వరూపమని కదా హిందూ సంప్రదాయం. హజ్ యాత్రికులు దాన్ని తాకడం కోసం
ఎగబడుతూంటారు. కాబా దగ్గఱ దాన్ని పూజించే ముస్లిమ్ ఇమామ్ లు అచ్చం మన
శైవపూజారుల తరహాలో బోడిగుండ్లు, పంచెలు, ఉత్తరీయాలూ ధరించి ఉంటారు. భక్తులు
కూడా అసలు అదే వేషంలో కాబాని దర్శించాలని నియమం ఉందట.ఆ నల్లఱాయి ఇస్లామ్
ఆవిర్భవించక ముందునుంచే అక్కడ ఒక పూజనీయవస్తువుగా ఉండేదని చారిత్రిక ఆధారాల
వల్ల తెలుస్తున్నది.
చాలా దశాబ్దాల క్రితం - అంటే అరేబియా పాశ్చాత్యుల అధీనంలో ఉన్నప్పుడు ఒక తెల్లవాడు ఆ ఆలయప్రాంగణంలో ఎల్లప్పుడూ మూసిపెట్టి ఉంచే ఒక గదిని తెఱిపించి చూశాడట. లోపల త్రిశూలాలు, శివలింగాలూ, సర్పాకార శిల్పాలు చాలా చూశానని, అలాంటివి ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని రాశాడు. ఆ గదిని ఎవరూ చూడకూడదనే నియమాన్ని ఇప్పుడు మాత్రం కట్టుదిట్టంగా అమలు జఱుపుతున్నారు.
చాలా దశాబ్దాల క్రితం - అంటే అరేబియా పాశ్చాత్యుల అధీనంలో ఉన్నప్పుడు ఒక తెల్లవాడు ఆ ఆలయప్రాంగణంలో ఎల్లప్పుడూ మూసిపెట్టి ఉంచే ఒక గదిని తెఱిపించి చూశాడట. లోపల త్రిశూలాలు, శివలింగాలూ, సర్పాకార శిల్పాలు చాలా చూశానని, అలాంటివి ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని రాశాడు. ఆ గదిని ఎవరూ చూడకూడదనే నియమాన్ని ఇప్పుడు మాత్రం కట్టుదిట్టంగా అమలు జఱుపుతున్నారు.
Comments
Post a Comment